Thursday, February 21, 2019

తెలంగాణ బడ్జెట్‌ లైవ్‌ అప్డేట్స్‌..


ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆర్థిక మంత్రిగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రసంగాన్ని సీఎం కేసీఆర్‌ చదివి వినిపిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. రాష్ర్టం ఏర్పడిన తర్వాత మొదటి నాలుగున్నరేళ్లలో అద్భుత విజయాలు సాధించాం. అత్యధికంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రాష్ర్టంగా తెలంగాణ రికార్డు సృష్టించింది.  ====.Readmore

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం


తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు సంతాపం తెలుపుతూ సీఎం కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు ====> Readmore

బడ్జెట్ ప్రసంగం చేయనున్న సీఎం



ముఖ్యమంత్రిగా ఉంటూనే ఆర్థికశాఖ బాధ్యతలను నిర్వర్తిస్తూ, రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం కొత్తేం కాదు. ఉమ్మడి ఏపీతోసహా దేశంలోని అనేక రాష్ర్టాల్లో ఈ సంప్రదాయం ఉన్నది. ఈ ఏడాది ఇప్పటివరకు దేశంలోని నాలుగు రాష్ర్టాల్లో ముఖ్యమంత్రులే స్వయంగా 2019-20 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గోవా సీఎం మనోహర్ పారికర్ జనవరి 30న బడ్జెట్ పెట్టగా.. ఈ నెల 8వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్, 9వ తేదీన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జైరాం ఠాకూర్ ఆర్థికశాఖ మంత్రి హోదాలో ఆయా రాష్ర్టాల బడ్జెట్లను ప్రవేశపెట్టారు. చరిత్రను పరిశీలిస్తే.. ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్‌రెడ్డి సీఎంగా ఉంటూనే 1955-56, 1957-58 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తూ 1968-69, 1969-70 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. మాజీ సీఎం కొణిజేటి రోశయ్య 2010లో ముఖ్యమంత్రిగా, ఆర్థికశాఖ మంత్రిగా కొనసాగుతూ 2010-11 బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, పద్దులను సభ్యులకు వివరించారు. ఇతర రాష్ర్టాల్లోనూ గతంలో అనేకమంది ముఖ్యమంత్రులు అదనంగా ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో 2015-16లో ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, కేరళలో 2016-17లో సీఎం ఉమెన్‌చాందీ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య, రాజస్థాన్‌లో సీఎం వసుంధర రాజే, నాగాలాండ్‌లో సీఎం సీకే సంగ్మా స్వయంగా 2018-19 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ఆర్థికమంత్రిగా బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న సీఎం కేసీఆర్

 cmkcr

కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఈ ఉదయం 11.30 గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. సభ ప్రారంభం కాగానే పుల్వామా అమరులకు సంతాపం తెలియజేస్తూ సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెడతారు. సభ్యుల నివాళి అనంతరం జీఎస్టీ చట్టానికి తీసుకువచ్చిన సవరణ బిల్లును ప్రతిపాదిస్తారు. అనంతరం 2018-19 వ్యయానికి సంబంధించి అనుబంధ పద్దులను, 2019-20 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు  ====> Readmore 

మరికాసేపట్లో తెలంగాణ బడ్జెట్‌



మరికాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సభ ప్రారంభమైన వెంటనే పుల్వామా ఉగ్రదాడి అమరులకు సంతాపం తెలుపుతూ సీఎం కేసీఆర్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను సీఎం ప్రవేశపెడ్తారు. శాసనమండలిలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడ్తారు  ===> Readmore

Friday, February 1, 2019

కేసీఆర్ రైతుబంధును కాపీకొట్టారు : ఎంపీ క‌విత‌


/modi-rythu-bandu-is-bad-copy-of-kcr-rythubandhu-scheme-tweets-kavitha

 తెలంగాణ సీఎం కేసీఆర్ చేప‌ట్టిన రైతు బంధు ప‌థ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వం..కాపీ కొట్టింద‌ని టీఆర్ఎస్ ఎంపీ క‌విత అన్నారు. కేంద్ర బ‌డ్జెట్‌పై ఇవాళ ఆమె త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. కేసీఆర్ రైతు బంధు స్కీమ్‌నే కేంద్రం కాపీ కొట్టింద‌ని, కానీ అది స‌రిగాలేద‌న్నారు. తెలంగాణ Read More

కేసీఆర్‌ రైతు బంధు Vs మోదీ రైతుబంధు

ts-rythu-bandhu


దేశంలోని రైతులతో పోలిస్తే తెలంగాణ రైతులు అదృష్టవంతులు. మోదీ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా రైతు బంధు పథకాన్ని ప్రకటించింది. ఇది తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న రైతు బంధుతో పోలిస్తే చాలా చిన్నది. కేంద్రం ప్రక‌టించిన‌ రైతుబంధు ఎకరాలతో నిమిత్తం లేకుండా ఒక రైతుకు సంవత్సరానికి కేవలం 6 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది. ఇక్కడ మరో కండీషన్‌ పెట్టింది. ఐదు  Read More