Thursday, February 21, 2019

తెలంగాణ బడ్జెట్‌ లైవ్‌ అప్డేట్స్‌..


ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆర్థిక మంత్రిగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రసంగాన్ని సీఎం కేసీఆర్‌ చదివి వినిపిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. రాష్ర్టం ఏర్పడిన తర్వాత మొదటి నాలుగున్నరేళ్లలో అద్భుత విజయాలు సాధించాం. అత్యధికంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రాష్ర్టంగా తెలంగాణ రికార్డు సృష్టించింది.  ====.Readmore

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం


తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు సంతాపం తెలుపుతూ సీఎం కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు ====> Readmore

బడ్జెట్ ప్రసంగం చేయనున్న సీఎం



ముఖ్యమంత్రిగా ఉంటూనే ఆర్థికశాఖ బాధ్యతలను నిర్వర్తిస్తూ, రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం కొత్తేం కాదు. ఉమ్మడి ఏపీతోసహా దేశంలోని అనేక రాష్ర్టాల్లో ఈ సంప్రదాయం ఉన్నది. ఈ ఏడాది ఇప్పటివరకు దేశంలోని నాలుగు రాష్ర్టాల్లో ముఖ్యమంత్రులే స్వయంగా 2019-20 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గోవా సీఎం మనోహర్ పారికర్ జనవరి 30న బడ్జెట్ పెట్టగా.. ఈ నెల 8వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్, 9వ తేదీన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జైరాం ఠాకూర్ ఆర్థికశాఖ మంత్రి హోదాలో ఆయా రాష్ర్టాల బడ్జెట్లను ప్రవేశపెట్టారు. చరిత్రను పరిశీలిస్తే.. ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్‌రెడ్డి సీఎంగా ఉంటూనే 1955-56, 1957-58 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తూ 1968-69, 1969-70 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. మాజీ సీఎం కొణిజేటి రోశయ్య 2010లో ముఖ్యమంత్రిగా, ఆర్థికశాఖ మంత్రిగా కొనసాగుతూ 2010-11 బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, పద్దులను సభ్యులకు వివరించారు. ఇతర రాష్ర్టాల్లోనూ గతంలో అనేకమంది ముఖ్యమంత్రులు అదనంగా ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో 2015-16లో ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, కేరళలో 2016-17లో సీఎం ఉమెన్‌చాందీ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య, రాజస్థాన్‌లో సీఎం వసుంధర రాజే, నాగాలాండ్‌లో సీఎం సీకే సంగ్మా స్వయంగా 2018-19 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ఆర్థికమంత్రిగా బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న సీఎం కేసీఆర్

 cmkcr

కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఈ ఉదయం 11.30 గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. సభ ప్రారంభం కాగానే పుల్వామా అమరులకు సంతాపం తెలియజేస్తూ సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెడతారు. సభ్యుల నివాళి అనంతరం జీఎస్టీ చట్టానికి తీసుకువచ్చిన సవరణ బిల్లును ప్రతిపాదిస్తారు. అనంతరం 2018-19 వ్యయానికి సంబంధించి అనుబంధ పద్దులను, 2019-20 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు  ====> Readmore 

మరికాసేపట్లో తెలంగాణ బడ్జెట్‌



మరికాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సభ ప్రారంభమైన వెంటనే పుల్వామా ఉగ్రదాడి అమరులకు సంతాపం తెలుపుతూ సీఎం కేసీఆర్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను సీఎం ప్రవేశపెడ్తారు. శాసనమండలిలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడ్తారు  ===> Readmore

Friday, February 1, 2019

కేసీఆర్ రైతుబంధును కాపీకొట్టారు : ఎంపీ క‌విత‌


/modi-rythu-bandu-is-bad-copy-of-kcr-rythubandhu-scheme-tweets-kavitha

 తెలంగాణ సీఎం కేసీఆర్ చేప‌ట్టిన రైతు బంధు ప‌థ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వం..కాపీ కొట్టింద‌ని టీఆర్ఎస్ ఎంపీ క‌విత అన్నారు. కేంద్ర బ‌డ్జెట్‌పై ఇవాళ ఆమె త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. కేసీఆర్ రైతు బంధు స్కీమ్‌నే కేంద్రం కాపీ కొట్టింద‌ని, కానీ అది స‌రిగాలేద‌న్నారు. తెలంగాణ Read More

కేసీఆర్‌ రైతు బంధు Vs మోదీ రైతుబంధు

ts-rythu-bandhu


దేశంలోని రైతులతో పోలిస్తే తెలంగాణ రైతులు అదృష్టవంతులు. మోదీ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా రైతు బంధు పథకాన్ని ప్రకటించింది. ఇది తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న రైతు బంధుతో పోలిస్తే చాలా చిన్నది. కేంద్రం ప్రక‌టించిన‌ రైతుబంధు ఎకరాలతో నిమిత్తం లేకుండా ఒక రైతుకు సంవత్సరానికి కేవలం 6 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది. ఇక్కడ మరో కండీషన్‌ పెట్టింది. ఐదు  Read More

కేంద్ర బడ్జెట్.. కేటాయింపులు

కేంద్ర బడ్జెట్.. కేటాయింపులు


 కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను రూ. 27,84,200 కోట్లకు అంచనా వేశారు.

-పెన్షన్లు - 1,74,300 కోట్లు
-రక్షణ రంగం - 3,05,296 కోట్లు
-ప్రధాన సబ్సిడీల కోసం - 2,96,684 కోట్లు
-వ్యవసాయం, దాని అనుంబంధ రంగాలకు - 1,49,981 కోట్లు
-వాణిజ్యం మరియు పరిశ్రమలకు - 27,660 కోట్లు Read More

మోదీ సర్కార్ ఓట్ల బడ్జెట్.. వరాలే వరాలు

మోదీ సర్కార్ ఓట్ల బడ్జెట్.. వరాలే వరాలు


తాత్కాలిక బడ్జెట్ అంటూ లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది మోదీ సర్కార్. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని చెప్పినా.. పూర్తిస్థాయి బడ్జెట్‌లాగే వరాల జల్లు కురిపించింది. రైతులు, వేతన జీవులు, అసంఘటిత కార్మికులకు వరాలు ప్రకటించింది. ఆదాయ పన్ను పరిమితిని పరోక్షంగా రూ.6.5 లక్షల వరకు పెంచింది. ఏడాదికి రూ.5 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయం ఉన్న వేతన జీవులకు ఫుల్ ట్యాక్స్ రీబేట్ అని ఆర్థిక మంత్రి పియూష్ గోయల్  Read More

ఆయుష్మాన్ భారత్.. 10 లక్షల మంది రోగులకు వైద్యం

ఆయుష్మాన్ భారత్.. 10 లక్షల మంది రోగులకు వైద్యం


ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య రక్షణ పథకమైన ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇప్పటి వరకు 10 లక్షల మంది రోగులు వైద్యం చేయించుకున్నారని కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని గోయల్ వెల్లడించారు. జన ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ Read More

ఆదాయ‌ప‌న్ను ప‌రిమితి 5 ల‌క్ష‌ల‌కు పెంపు.. కానీ

piyush goyal budget 2019


ఆదాయ‌ప‌న్నుపై ఉన్న ప‌రిమితిని 5 ల‌క్ష‌ల వ‌ర‌కు పెంచారు. మంత్రి పీయూష్ గోయ‌ల్ ఇవాళ త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అయితే వ్య‌క్తిగ‌తంగా 5 ల‌క్ష‌లు ఆర్జిస్తున్న వారికి పూర్తి ట్యాక్స్ రిబేట్‌ను క‌ల్పిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. ప‌న్నులు చెల్లిస్తున్న వారికి మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మంత్రి త‌న ప్ర‌సంగం చివ‌ర‌ల్లో ఐటీశ్లాబ్ అంశాన్ని ప్ర‌స్తావించారు.

5 ల‌క్ష‌ల ఆదాయానికి పూర్తి ట్యాక్స్ రిబేట్ క‌ల్పిస్తున్న‌ట్లు మంత్రి ప్ర‌క‌టించ‌గానే.. Read More

ముగిసిన బడ్జెట్.. సభ సోమవారానికి వాయిదా

loksabha-adjourn-to-february


పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం లోక్‌సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. తాత్కాలిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ సభలో ప్రవేశపెట్టారు. సుమారు రెండు గంటల పాటు బడ్జెట్‌ను చదివి వినిపించారు పీయూష్ గోయల్.

గోయ‌ల్ బ‌డ్జెట్ చ‌దువుతున్న స‌మ‌యంలో.. ప్ర‌ధాని మోదీ ఆనందంగా Read More

2022 నాటికి అంతరిక్షంలో భారతీయ వ్యోమగాములు


piyush goyal budget 2019

అంగన్‌వాడీ సిబ్బంది వేతనం 50శాతం పెంపుతున్నట్లు ఆర్థికశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. 2030 నాటికి డిజిటల్‌ ఇండియాలోకి భారతీయులు అడుగుపెడతారని వివరించారు. 2022 నాటికి అంతరిక్షంలోకి భారతీయ వ్యోమగాములను పంపిస్తామని మంత్రి పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఆవతరించనుంది. రానున్న 8 ఏళ్లలో 10 ట్రిలియన్‌ డాలర్లకు ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. Read More 

ప‌దేప‌దే బ‌ల్ల చ‌రిచిన మోదీ - వీడియో

modi strikes bench in loksabha


చివ‌రి బ‌డ్జెట్ వేళ‌.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అత్యంత ఉత్సాహాంగా క‌నిపించారు. లోక్‌స‌భ‌లో ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయ‌ల్ బ‌డ్జెట్ చ‌దువుతున్న స‌మ‌యంలో.. ప్ర‌ధాని మోదీ ఆనందంగా క‌నిపించారు. ప్ర‌భుత్వ స్కీమ్‌ల‌ను మంత్రి చ‌దువుతున్న స‌మ‌యంలో మోదీ ప‌దే ప‌దే బ‌ల్ల‌ను చ‌రుస్తూ క‌నిపించారు. చాలా హుషారుగా ఆయ‌న త‌న Read More

రైల్వే రంగానికి 64 వేల 587 కోట్లు

రైల్వే రంగానికి 64 వేల 587 కోట్లు

రైల్వే రంగానికి బడ్జెటరీ సపోర్టు కింద రూ. 64 వేల 587 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మిజోరాం, మేఘాలయా రాష్ర్టాలను రైల్వేతో అనుసంధానం చేశామన్నారు. రైల్వేల చరిత్రలో ఇది ప్రమాదాలు తక్కువగా ఉన్న ఏడాది అని స్పష్టం చేశారు. బ్రాడ్ గేజ్‌లో Read More

2025 నాటికి ప్రతీ ఒక్కరికీ ఇల్లు

2025 నాటికి ప్రతీ ఒక్కరికీ ఇల్లు

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు మొత్తం 1.53కోట్ల ఇండ్లు నిర్మించి ఇచ్చినట్లు తాత్కాలిక ఆర్థికశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. 2025 నాటికి ప్రతీ ఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలకు 143 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. 22 పంటలకు కనీస మద్దతు ధరను 1.5రెట్లు పెంచినట్లు చెప్పారు. 2019-20లో Read More

ర‌క్ష‌ణ‌శాఖ‌కు 3 ల‌క్ష‌ల కోట్లు

piyush goyal budget 2019

ర‌క్ష‌ణ‌శాఖ‌కు కేంద్ర ప్ర‌భుత్వం మూడు ల‌క్ష‌ల కోట్లు కేటాయించింది. ఇవాళ కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ బ‌డ్జెట్‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. సైనికుల కోసం వ‌న్ ర్యాంక్ వ‌న్ పెన్ష‌న్ కింద 35వేల కోట్లు పంపిణీ చేసిన‌ట్లు మంత్రి గోయ‌ల్ తెలిపారు. మ‌న సైనికులే మ‌న గ‌ర్వ‌మ‌ని, 40 ఏళ్లుగా Read More

మోదీ రైతుబంధు.. ఏటా 6 వేలు

piyush goyal budget 2019


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతుబంధును కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంది. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు ప్రత్యేక ఆర్థికసాయం చేయనున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 2 హెక్టార్లలోపు(ఐదు ఎకరాలు)  Read More

Union Budget 2019 Highlights Video


Get the Latest Budget News, Videos, Highlights of #UnionBudget2019 of India 2019, Budget Speech from @piyushgoyal , Economic Survey, Income tax slab & Railway Budget. Catch live coverage of the #Budget2019

దేశంలో 5.45 లక్షల ఓడీఎఫ్‌ గ్రామాలు

piyush goyal budget 2019

స్వచ్ఛభారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న భారతీయులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ మధ్యంతర బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 98శాతానికి పైగా పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తిచేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు Read More

తాత్కాలిక బ‌డ్జెట్ అంటే ?


తాత్కాలిక బ‌డ్జెట్ అంటే ?

కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ ఇవాళ తాత్కాలిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. దీన్ని మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌ను కూడా అంటున్నారు. తాము ప్ర‌వేశ‌పెట్ట‌బోయేది ఇంటీరిం బ‌డ్జెట్ అని ప్ర‌ధాని మోదీ కూడా స్ప‌ష్టం చేశారు. ఈ బ‌డ్జెట్‌నే ఓట్ ఆన్ అకౌంట్ అని కూడా అంటారు. రానున్న నాలుగు లేదా అయిదు నెల‌ల ప‌ద్దుల‌ను మాత్ర‌మే ఈ బ‌డ్జెట్‌లో చూపిస్తారు. అయితే సాధార‌ణ ఎన్నిక‌ల త‌ర్వాత మ‌ళ్లీ Read More

ఆదాయ‌ప‌న్ను ప‌రిమితి 5 ల‌క్ష‌ల‌కు పెంపు.. కానీ


piyush goyal budget 2019

ఆదాయ‌ప‌న్నుపై ఉన్న ప‌రిమితిని 5 ల‌క్ష‌ల వ‌ర‌కు పెంచారు. మంత్రి పీయూష్ గోయ‌ల్ ఇవాళ త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అయితే వ్య‌క్తిగ‌తంగా 5 ల‌క్ష‌లు ఆర్జిస్తున్న వారికి పూర్తి ట్యాక్స్ రిబేట్‌ను క‌ల్పిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. ప‌న్నులు చెల్లిస్తున్న వారికి మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మంత్రి త‌న ప్ర‌సంగం చివ‌ర‌ల్లో ఐటీశ్లాబ్ అంశాన్ని ప్ర‌స్తావించారు.

5 ల‌క్ష‌ల ఆదాయానికి పూర్తి ట్యాక్స్ రిబేట్ క‌ల్పిస్తున్న‌ట్లు మంత్రి ప్ర‌క‌టించ‌గానే.. ప్ర‌తిప‌క్ష స‌భ్యులు అభ్యంత‌రం తెలిపారు. కానీ ట్రెజ‌రీ బెంచుల్లో ఉన్న స‌భ్యులు మాత్రం మోదీ మోదీ అంటూ నినాదాలు  Read More

Thursday, January 31, 2019

మోదీ రైతుబంధు.. ఏటా 6 వేలు

piyush goyal budget 2019

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతుబంధును కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంది. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు ప్రత్యేక ఆర్థికసాయం చేయనున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 2 హెక్టార్లలోపు(ఐదు ఎకరాలు) ఉన్న ప్రతి రైతుకు ఏటా రూ. 6 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్లు పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రత్యక్షంగా రైతుల బ్యాంకు Read More

ద్రవ్యోల్బణాన్ని గణనీయంగా తగ్గించగలిగాం

piyush goyal budget 2019

ఆర్థిక వృద్ధి రేటులో 11వ స్థానంలో ఉన్న భారతదేశం.. నేడు ఆరోస్థానానికి చేరుకుందని కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. పార్లమెంట్‌లో బడ్జెట్‌ను చదివి వినిపిస్తున్నారు పీయూష్ గోయల్. నాలుగున్నరేళ్లలో రెండంకెల్లో ఉన్న ద్రవ్యోల్బణాన్ని గణనీయంగా తగ్గించగలిగామని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులను గణనీయంగా తగ్గించగలిగాం. బ్యాంకింగ్ రంగంలో ఎన్నో సంస్కరణలు  Read More

బ‌డ్జెట్ 2019-20 లైవ్‌ అప్‌డేట్స్‌

piyush goyal budget 2019


న్యూఢిల్లీ: లోక్‌స‌భ‌లో ఆర్థిక మంత్రి పియూష్ గోయ‌ల్ తాత్కాలిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతున్నారు. బ‌డ్జెట్‌కు సంబంధించిన స‌మాచారం ఇదీ

- ప్ర‌పంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్య‌వస్థ మ‌న‌ది
- ద్ర‌వ్యోల్బ‌ణం 2009-14 మ‌ధ్య ప‌దికి పైగా ఉంది
- పెరుగుతున్న ధ‌ర‌ల న‌డ్డి విరిచాం Read More